క్రీడాభూమి

బిగ్ బాష్ లీగ్‌తో మంధానా కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మహిళల టోర్నీలో భారత బ్యాట్స్‌విమన్ స్మృతి మంధాన పాల్గొననుంది. బిబిఎల్‌లో పోటీపడే బ్రిస్బేన్ హీట్స్‌తో ఆమె ఏడాది పాటు అమల్లో ఉండే ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ లభించిందని, దీనితో కాంట్రాక్టు లాంఛనాలు పూర్తయ్యాయని మంధానా మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. బ్రిస్బేన్ జట్టుతో తాను ఇంతకు ముందు మ్యాచ్ ఆడానని, ఇప్పుడు అదే జట్టులో సభ్యురాలుగా చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. వివిధ టోర్నీలకు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు ఏ విధంగా సిద్ధమవుతారు? ఫిట్నెస్ కోసం వారు అనుసరించే విధానాలు ఏమిటి? అన్నది ఆసక్తిని రేపుతున్నాయని చెప్పింది. బిగ్ బాష్‌లో ఆడడం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని మంధానా అన్నది. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న క్రీకారిణులతో కలిసి ఆడడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకోగలుగుతామని తెలిపింది. ఇలావుంటే, మంధానా బిగ్ బాష్‌లో ఆడుతున్న రెండో భారత క్రీడాకారిణి. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే సిడ్నీ థండర్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకుంది.