క్రీడాభూమి

కోహ్లీ, గంభీర్ సరదా ముచ్చట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 29: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీమిండియా గురువారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఇందులో వింత లేకపోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చిన గౌతం గంభీర్ సరదాగా ముచ్చటించుకోవడం మాత్రం విచిత్రమే. 2013 ఐపిఎల్ సీజన్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ బాహాబాహీకి దిగిన విషయం అభిమానులు ఇంకా మరచిపోలేదు. ఇద్దరూ పరస్పరం కొట్టుకునే పరిస్థితి అంపైర్లు, తోటి ఆటగాళ్ల జోక్యంతో తృటిలో తప్పింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కోహ్లీ కూడా ప్యాడ్స్ కట్టుకొని నెట్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. అనంతరం కోచ్ అనిల్ కుంబ్లేతో కూడా గంభీర్ మాట్లాడడం కనిపించింది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం నెట్స్‌కు రాలేదు. గురువారం ప్రాక్టీస్‌కు వచ్చినప్పటికీ, బౌలింగ్ చేయలేదు. కొద్దిసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అనారోగ్యంతో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, అతను రెండో టెస్టు ఆరంభంలోగా కోలుకుంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేసింది.

చిత్రం.. గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ