క్రీడాభూమి

పారాలింపిక్స్ విజేతలకు ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఘన సన్మానం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పారాలింపిక్స్ విజేతలకు తలా 15 లక్షల రూపాయల నగదు నజరానా ఇవ్వాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంతో, రియోలో పతకాలు సాధించిన దేవేంద్ర ఝజారియా (జావెలిన్‌త్రోలో స్వర్ణం), మరియప్పన్ తంగవేలు (హైజంప్‌లో స్వర్ణం), దీపా మాలిక్ (షాట్‌పుట్‌లో రజతం), వరుణ్ సింగ్ భాటీ (హైజంప్‌లో కాంస్యం)లకు చెక్కులను అందచేశారు. అదే విధంగా మాజీ విజేతలైన మురళీకాంత్ పేట్కర్ (1972), భీమరావు కెస్టా, జోగీందర్ సింగ్ బేడీ (1984), రాజేందర్ సింగ్ రహేలు (2014), గిరీష (2012)లకు కూడా నగదు బహుమతిని ప్రకటించారు.

చిత్రం.. రియో పారాలింపిక్ విజేతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తెండూల్కర్