క్రీడాభూమి

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు లభించింది. అతను తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 54 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అవుట్ కాకుండా 58 పరుగులు చేశాడు. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకాలు నమోదు చేసిన నాలుగో భారత వికెట్‌కీపర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు మహేంద్ర సింగ్ ధోనీ (4 పర్యాయాలు), ఫరూఖ్ ఇంజనీర్, దిలావర్ హుస్సేన్ ఈ ఫీట్ సాధించారు. గత తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్‌లో సాహా అత్యధిక స్కోరు 36 పరుగులుకాగా, ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకాలు సాధించాడు.

చిత్రం.. వృద్ధిమాన్ సాహా