క్రీడాభూమి

సెక్యూరిటీ పేరుతో నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ) అధికారి ఒకరు భద్రత పేరుతో పారాసైక్లిస్ట్ ఆదిత్య మెహతాకు నరకం చూపాడు. అతని కృత్రిమ కాలును బలవంతంగా తీయించాడు. విమానం బయలుదేరే సమయం ముంచుకురావడంతో హడావుడిగా దానిని తిరిగి ధరించిన ఆదిత్య కాలు రక్తమోడింది. శారీరకంగానేగాక, మానసికంగానూ వేధించిన ఈ ఉదంతాన్ని అతను పిటిఐకి వివరించాడు. కెఐఎ విమానాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్ అధికారి ఠాకూర్ దాస్ భద్రత పేరుతో నిలిపివేశాడని చెప్పాడు. తాను ధరించిన కృత్రిమ కాలును తీయించి మరీ తనిఖీ చేశాడని అన్నాడు. దానిని తిరిగి వేసుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుందని ఆదిత్య తెలిపాడు. తాను ఆ ప్రయత్నంలో ఉండగానే, విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటన రావడంతో, గత్యంతరం లేక హడావుడిగా కృత్రిమ కాలును ధరించానని, అప్పటి నుంచి భరించలేనంత నొప్పితో బాధపడ్డానని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే కాలు రక్తమోడుతూ ఉందని వాపోయాడు. విమానం అందుకోవడానికి తగినంత సమయం లేదని తాను సదరు అధికారికి విన్నవించినా అతను పట్టించుకోలేదని ఆరోపించాడు. గతంలోనూ ఆదిత్యకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. బెంగళూరులో ఒకసారి, ఢిల్లీలో మరోసారి సెక్యూరిటీ పేరుతో అధికారులు అతనిని వేధించారు.

ఆదిత్య మెహతా (ఫైల్ ఫొటో)