క్రీడాభూమి

సానియా మీర్జాకే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్ మహిళల డబుల్స్ విభాగంలో భారత మేటి క్రీడాకారిణి సానియా మీర్జా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అగ్రస్థానంలో ఆమె 80 వారాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. వారి సహకారంతోనే తాను ఎదిగానని, దేశానికి మరింత ఎక్కువగా సేవలు అందించాలని కోరుకుంటున్నానని తెలిపింది. కాగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి ఆమె ఇటీవలే పాన్ పసిఫిక్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. సానియా మొత్తం 8,885 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, గతంలో ఆమెకు డబుల్స్ భాగస్వామిగా ఉన్న మార్టినా హింగిస్ 8,560 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. పురుషుల సింగిల్స్ విభాగంలో మన దేశంలో నుంచి సాకేత్ మైనేనీ అత్యుత్తమంగా 138వ స్థానంలో నిలిచాడు. రాంకుమార్ రామనాథన్ పది స్థానాలను మెరుగుపరచుకొని, ప్రస్తుతం 229వ స్థానానికి చేరుకున్నాడు. యుకీ భంబ్రీ 62 స్థానాలు కోల్పోయి, 282వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బొపన్న 18, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ 60 స్థానాల్లో ఉన్నారు.