క్రీడాభూమి

సెమీస్ చేరిన వర్మ సోదరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 5: బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ‘వర్మ సోదరులు’గా అందరికీ తెలిసిన భారత వీరులు సౌరవ్, సమీర్ సెమీ ఫైనల్స్ చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సౌరవ్ 21-15, 16-21, 21-15 ఆధిక్యంతో స్థానిక ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ వెబ్లెర్‌పై ఎవరూ ఊహించని విజయాన్ని నమోదు చేశాడు. సౌరవ్ గత మూడు టోర్నీల్లో ఫైనల్ చేరి, సెమీస్‌లో మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, అతని తమ్ముడు సమీర్ 21-14, 21-16 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఆర్టెమ్ పొచరొవ్‌పై సులభంగా నెగ్గి, సెమీస్‌లో చోటు సంపాదించాడు.