క్రీడాభూమి

అసలు కుక్ మీ వాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: ద్వైపాక్షిక అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇక్కడ బ్రిటిష్ ప్రధాని థెరిస్సా మేతో చర్చలు జరిపారు. టీమిండియాతో బుధవారం నుంచి టెస్టు సిరీస్‌లో తలపడబోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మోదీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి భారత జట్టుతో తొలి టెస్టు ఆడబోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సిరీస్‌లో ఉత్తమ జట్టే గెలుస్తుంది’ అని థెరిస్సా మేతో ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టెస్టు క్రికెట్ జట్టు బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. 9న రాజ్‌కోట్‌లో ప్రారంభమయ్యే మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే మోదీ ఇంగ్లాండ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, బ్రిటన్ ప్రజల మధ్య బలమైన సంబంధాలు, క్రికెట్ పట్ల ప్రేమాభిమానాలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్, బ్రిటన్ పధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం అసలు వీరిద్దరి క్రికెట్ ప్రస్తావన ఎలా వచ్చిందనే విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వివరించారు. ‘క్రికెట్‌కు మాదిరిగానే మా విందు కూడా మీరు ఆస్వాదించి ఉంటారు’ అని మోదీ పేర్కొనగా, ‘అవును.. చాలా బాగుంది’ని థెరిస్సా మే సంతోషాన్ని వ్యక్తం చేశారని, దీంతో ‘మా వద్ద మంచి కుక్ (వంట మనిషి) ఉన్నాడు. కానీ అసలు కుక్ (ఆలిస్టర్ కుక్) ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు’ అని మోదీ చమత్కరించడంతో అక్కడ నవ్వులు విరిశాయని వికాస్ స్వరూప్ తెలిపారు.

చిత్రం.. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లాన్‌లో
బ్రిటన్ ప్రధానితో చర్చిస్తున్న నరేంద్ర మోదీ