క్రీడాభూమి

విజయవాడలో 2 నుంచి సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 15: కృష్ణాజిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 2నుండి 5 వరకు 30వ జాతీయస్థాయి సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. మంగళవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంతోపాటు విజయవాడ క్లబ్, శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో టోర్నీ నిర్వహిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని, టోర్నీలో పాల్గొనే వారందరికి ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1వతేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు, క్రీడాశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని టోర్నీని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారులు తెలంగాణ నుండి గాయత్రి గోపీచంద్, కేయురా మోపటి, సమియ, పుల్లెల సాయి విష్ణు, జి ప్రణవ్ రావు పాల్గొంటారని అన్నారు.