క్రీడాభూమి
సింధు ఓటమి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జనవరి 1: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) టోర్నీ ఆదివారం మొదలుకాగా, మొదటి మ్యాచ్లో చెన్నై స్మాషర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ పివి సింధు పరాజయాన్ని చవిచూసింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధును ఓడించిన కరోలినా మారిన్ ఈ టోర్నీలో హైదరాబాద్ హంటర్స్ తరఫున ఆడుతూ, తొలి మ్యాచ్లో 11-8, 12-14, 11-2 తేడాతో విజయం సాధించింది. మొదటి సెట్లో గట్టిపోటీనిచ్చినప్పటికీ దానిని చేజార్చుకున్న సింధు రెండో సెట్లో గొప్పగా ఆడింది. మారిన్ నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, ఆ సెట్ను తన ఖాతాలో వేసుకుంది. అయితే, కీలకమైన చివరి సెట్లో దారుణంగా విఫలమై, ఓటమిపాలైంది.
సింధు ఓటమితో, వెనుకబడిన చెన్నైకి టామీ సుగియార్తో ఊరటనిచ్చాడు. హైదరాబాద్ ఆటగాడు సాయి ప్రణీత్తో జరిగిన మ్యాచ్ని అతను 11-6, 11-8 తేడాతో వరుస సెట్లలో గెల్చుకున్నాడు. దీనితో తొలిరోజు మొదటి రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్, చెన్నై చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి.