క్రీడాభూమి

అవాధే దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 5: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో భాగంగా గురువారం ఢిల్లీ ఏసర్స్‌పై అవాధే వారియర్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తమతమ ప్రత్యర్థులను ఓడించి, అవాధే విజయంలో కీలక భూమిక పోషించడం విశేషం. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో గోషెమ్, మార్టిన్ కిడో జోడీ 11-4, 11-4 తేడాతో అక్షయ్ దివాల్కర్, వ్లాదిమీర్ ఇవానొవ్ జోడీని ఓడించి, అవాధే పాయింట్ల ఖాతాను తెరిచారు. మహిళల సింగిల్స్‌లో నిచానన్ జిందాపొల్‌తో తలపడిన సైనా 14-12, 11-7 స్కోరుతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో జరగ్గా, శ్రీకాంత్ 11-9, 11-13, 11-9 తేడాతో గెలుపొంది, అవాధేకు 3-0 ఆధిక్యాన్ని అందించాడు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా, వ్లాదిమీర్ ఇవానొవ్ జోడీని సావిత్రి అమిత్రపాల్, బోడిన్ ఇసారా జోడీ 12-10, 11-5 తేడాతో ఓడించడంతో అవాధే ఆధిక్యం 4-0కు చేరింది. పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన చివరి మ్యాచ్‌లో వినె్సంట్ వాంగ్ వింగ్ కీ 11-8, 11-6 తేడాతో సో వాన్ హోను ఓడించి, అవాధే విజయాలను పరిపూర్ణం చేశాడు.