క్రీడాభూమి
రెండో రౌండ్కు హర్షీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సరవక్ (మలేసియా), జనవరి 17: మలేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు హర్షీల్ డానీ, ప్రతుల్ జోషి, హేమంత్ ఎం.గౌడ రెండో రౌండ్కు దూసుకెళ్లారు. గత ఏడాది లక్నోలో నిర్వహించిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ప్రీ గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న 20 ఏళ్ల హర్షీల్ మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 21-19, 21-17 గేముల తేడాతో మలేసియా ఆటగాడు జీ జియా లీని మట్టికరిపించాడు. అలాగే గత ఏడాది బహ్రెయిన్ ఇంటర్నేషనల్ టైటిల్ను కైవసం చేసుకున్న ప్రతుల్ జోషి 15-21, 21-16, 24-22 గేముల తేడాతో సింగపూర్కు చెందిన జిన్ జెయి ర్యాన్పై చెమడోడ్చి విజయం సాధించగా, మరో పోరులో హేమంత్ ఎం.గౌడ 21-14, 21-15 తేడాతో ఇండోనేషియాకు చెందిన యెహెజ్కియెల్ ఫ్రిట్జ్ను చిత్తు చేశాడు. అయితే ఈ టోర్నీలో భారత్కు చెందిన సరిల్ వర్మ, అభిషేక్ యెలెగార్, చిట్టబోయిన రాహుల్ యాదవ్లకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. థాయిలాండ్కు చెందిన పన్నవిట్ తొంగ్నువమ్ 21-10, 18-21, 21-17 గేముల తేడాతో సరిల్ వర్మను, మలేసియాకు చెందిన 13వ సీడ్ ఆటగాడు జుల్ఫద్లి జుల్క్ఫి 21-13, 21-14 తేడాతో అభిషేక్ను ఓడించగా, రాహుల్ యాదవ్ 16-21, 11-21 తేడాతో చైనీస్ తైపీ ఆటగాడు హుయి హువాన్ యి చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.