క్రీడాభూమి
మోదీ గ్రాండ్ ప్రీ టోర్నీకి సైనా డుమ్మా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 January 2017
లక్నో, జనవరి 23: క్వాలిఫయింగ్ మ్యాచ్లతో, మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనరాదని భారత స్టార్ సైనా నెహ్వాల్ నిర్ణయించుకుంది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టైటిల్ను సాధించిన ఆమె, వచ్చేనెలాఖరులో మొదలయ్యే జర్మనీ ఓపెన్లో పాల్గొంటానని ప్రకటించింది. కాగా, మలేసియా ఓపెన్కు దూరమైన రియో ఒలింపిక్స్ రజత పతక విజతే పివి సింధు ఇప్పుడు మోదీ స్మారక గ్రాండ్ ప్రీ టోర్నీలో హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగుతున్నది. తాను పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, టైటిల్ దక్కించుకుంటానని సింధు ధీమా వ్యక్తం చేస్తున్నది. ఆమెకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయ.