క్రీడాభూమి

అశ్విన్, జడేజాకు రెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది వరకే ప్రకటించిన జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి, వారి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఎంపిక చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మార్పులు చేసిందని బిసిసిఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 26 (కాన్పూర్), 29 (నాగపూర్), ఫిబ్రవరి 1 (బెంగళూరు) తేదీల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టి-20 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇంగ్లాండ్‌తో టి-20 సిరీస్‌కు జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, మన్దీప్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్, యుజువేంద్ర చాహల్, మనీష్ పాండే, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా.

చిత్రం..రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా