క్రీడాభూమి

లంకతో టి-20 సిరీస్‌కు ఆసీస్ సారథిగా ఫించ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 31: శ్రీలంకతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ సారథ్యం వహించనున్నాడు. సోమవారం న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ వనే్డ క్రికెట్ మ్యాచ్‌లో తలపడిన ఆస్ట్రేలియా జట్టుకు ఫించ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. అయితే ఫిబ్రవరిలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో తలపడేందుకు ఎంపిక చేసిన తమ జట్టు నుంచి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి కల్పించి ఫించ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) మంగళవారం ప్రకటించింది. గతంలో ఆరుసార్లు ఆస్ట్రేలియా టి-20 జట్టుకు సారథ్యం వహించిన తనకు మళ్లీ జాతీయ జట్టులో చోటు కల్పించడం, ప్రత్యేకించి స్టీవ్ లేకుండా తాను జట్టుకు సారథ్యం వహించనుండటం ఎంతో ఉత్సుకతను కలిగిస్తోందని ఫించ్ చెప్పాడు.

చిత్రం.. ఆరోన్ ఫించ్