క్రీడాభూమి

గుజరాత్‌పై ముంబయి గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 25: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను ముంబయి 98 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ ఆదిత్య తారే (83), సిద్దేష్ లాడ్ (64) అర్ధ శతకాలతో రాణించడంతో, ముంబయి 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 273 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్ 41.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రపై బెంగాల్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. అనంతరం బెంగాల్ 48.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 226 పరుగులు సాధించి, విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ని మధ్యప్రదేశ్ మూడు వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. రాజస్థాన్ 49.1 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్‌కాగా, మధ్యప్రదేశ్ 40 ఓవర్లలో, ఏడు వికెట్లకు 212 పరుగులు చేసి గెలిచింది.