క్రీడాభూమి
పుణె జట్టులోకి శార్దూల్ ఠాకూర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 March 2017
న్యూఢిల్లీ, మార్చి 6: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ క్రికెట్ జట్టుకు సేవలు అందిస్తున్న పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (ఆర్పిఎస్) కొనుగోలు చేసింది. దీంతో అతను ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 10వ ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సేవలు అందించనున్నాడు. 2014లో జరిగిన ఐపిఎల్ ఆటగాళ్ల వేలంలో శార్దూల్ ఠాకూర్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన విషయం విదితమే. అయితే ఇటీవలే ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ను కొనుగోలు చేసిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ సేవలను కూడా అందిపుచ్చుకోనుంది.