క్రీడాభూమి
వీనస్ దూకుడుకు వెస్నినా బ్రేక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇండియన్ వెల్స్, మార్చి 17: ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ దూకుడుకు ఎలెనా వెస్నినా బ్రేక్ వేసింది. క్వార్టర్ ఫైనల్లో తన కంటే రెండు ర్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్న వీనస్ను 14వ ర్యాంకర్ వెస్నినా 6-2, 4-6, 6-3 తేడాతో ఓడించి సెమీస్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం ఆమె మ్లాడెనొవిచ్ను ఢీ కొంటుంది. అతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో క్రిస్టినా మ్లాడెనొవిచ్ 3-6, 7-6, 6-2 ఆధిక్యంతో కరోలిన్ వొజ్నియాకిపై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 13వ స్థానంలో ఉన్న వొజ్నియాకి తన కంటే 15 స్థానాలు దిగువున ఉన్న క్రీడాకారిణి చేతిలో ఓడడం గమనార్హం. కాగా, పురుషుల సింగిల్స్లో స్టానిస్లాస్ వావ్రిన్కా, పాబ్లో కారెనో బస్టా సెమీ ఫైనల్స్ చేరారు. మూడో ర్యాంక్ ఆటగాడు వావ్రిన్కా 6-4, 4-6, 7-6 తేడాతో డామినిక్ థియెమ్పై విజయం సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కారెనో బస్టా 6-1, 3-6, 7-6 తేడాతో పాబ్లో క్యువాస్ను ఓడించాడు.
చిత్రం..ఎలెనా వెస్నినా