క్రీడాభూమి
సాత్విక్-చిరాగ్కు వియత్నాం చాలెంజర్ టైటిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 March 2017
న్యూఢిల్లీ, మార్చి 27: వియత్నాం ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజర్ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో ఆరో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ఉత్కంఠ భరితంగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో థాయిలాండ్కు చెందిన మూడో సీడ్ జోడీ ట్రావట్ పొటెంగ్, నంథకమ్ యోర్డ్పైసాంగ్పై విజయం సాధించారు. శనివారం సెమీఫైనల్లో హెండ్రా అప్రిడా గుణవాన్, మార్కిస్ కిడో (రెండో సీడ్ జోడీ)పై సంచలన విజయం సాధించిన సాత్విక్-చిరాగ్, ఆదివారం హొనోయిలో 50 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో 17-21, 21-9, 21-15 గేముల తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి టైటిల్తో పాటు 20 వేల డాలర్ల నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు.