క్రీడాభూమి

హాంకాంగ్‌పై భారత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాంగ్యాంగ్, ఏప్రిల్ 11: ఎఎఫ్‌సి ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న భారత మహిళా జట్టు మంగళవారం గ్రూప్-బిలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో హాంకాంగ్ జట్టును మట్టికరిపించింది. 68వ నిమిషంలో సస్మితా మాలిక్, 70వ నిమిషంలో రతన్‌బాలా దేవి చెరో గోల్ సాధించి భారత్‌కు ఈ విజయాన్ని అందించారు. దీంతో గ్రూప్-బిలోని మొత్తం ఐదు జట్లలో భారత జట్టు మూడు పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇంతకుముందు భారత జట్టు వరుసగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్ చేతిలో ఘోర పరాజయాలను ఎదుర్కొని ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.