క్రీడాభూమి

షారుఖ్ వస్తున్నాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 11: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ శనివారం ముంబయి ఇండియన్స్‌తో ఆడే చివరి గ్రూప్ మ్యాచ్‌ని చూసేందుకు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హాజరుకానున్నాడు. ఇక్కడ జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌కి షారుఖ్ హాజరయ్యాడని, దానిని నైట్ రైడర్స్ 10 వికెట్ల తేడాతో గెల్చుకుందని గుర్తుచేశాడు. అదే విధంగా చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ అతని రాకతో నైట్ రైడర్స్ చెలరేగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, షారుఖ్ హారయ్యే మ్యాచ్‌లకు వివిఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పాస్‌లు జారీ చేయడంలో సమస్యలు కూడా ఎదురవుతాయని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, సమస్య ఏమీ ఉండదని వెంకీ మైసూర్ అన్నాడు. సైమన్ కటిచ్‌కి పాస్‌ల జారీ బాధ్యతను అప్పచెప్పామని, ఎలాంటి ఒడుదుడుకులు ఎదురుకావని ధీమా వ్యక్తం చేశాడు.