క్రీడాభూమి

తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యూకెకొ (న్యూజిలాండ్), మే 14: న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మహిళల హాకీ టెస్టు సిరీస్‌లో భారత్ మొదటి మ్యాచ్‌ని 1-4 తేడాతో కోల్పోయింది. ఆస్ట్రో టర్ఫ్‌పై వేగంగా కదిలే అలవాటున్న న్యూజిలాండ్ క్రీడాకారిణులు ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 13వ నిమిషంలో జోర్డాన్ గ్రాండ్ ద్వారా ఆ జట్టుకు తొలి గోల్ లభించింది. మరో పది నిమిషాల్లో ఆలివియా మెర్రీ కివీస్‌కు రెండో గోల్ అందించింది. దీనితో కంగుతున్న భారత్ ఎదురుదాడికి దిగింది. 31వ నిమిషంలో అనూప బర్లా గోల్ చేసి, న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ద్వితీయార్ధంలో కివీస్ విజృంభణ కొనసాగితే, భారత్ పూర్తి ఆత్మరక్షణలో పడింది. 43వ నిమిషంలో రాచెల్ మెక్‌కాన్, 55వ నిమిషంలో డియానా రిచీ గోల్స్ సాధించి, న్యూజిలాండ్‌కు 4-1 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టారు. భారత జట్టు గోల్స్ సాధించే పలు అవకాశాలను చేజార్చుకొని, ఓటమిని కొనితెచ్చుకుంది.