క్రీడాభూమి
ఈ పెయింటింగ్ ఖరీదు రూ. 23.77 కోట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 June 2017
బర్మింగ్హామ్, జూన్ 13: ఐపిఎల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ప్రముఖ చిత్రకారుడు సషా జాఫ్రీ వేసిన పెయింట్కు అక్షరాలా 23.77 కోట్ల రూపాయల ధర పలికింది. బ్రిటన్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన పూనమ్ గుప్తా ఈ భారీ మొత్తాన్ని చెల్లించింది. మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, డేవిడ్ బెక్హామ్ వంటి పలువురు క్రీడాకారులు నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాల కోసం తన పెయింట్స్ అమ్మడం ద్వారా వచ్చే మొత్తాలను అందచేస్తున్న సషా ఇప్పుడు కోహ్లీ కోసం ప్రత్యేక చిత్రాన్ని వేశాడు. కోహ్లీ ఫౌండేషన్ ఇటీవల ఇచ్చిన చారిటీ డిన్నర్లో దీనిని ప్రదర్శనకు కూడా ఉంచారు. కోహ్లీపై ఉన్న అభిమానంతో పూనమ్ కోట్ల రూపాయలు కుమ్మరించి దానిని సొంతం చేసుకుంది.