క్రీడాభూమి

సైనా, సింధు నిష్క్రమణ రెండో రౌండ్‌లోనే ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 15: ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు ‘తెలుగు తేజం’ పివి.సింధుకి చుక్కెదురైంది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. థాయిలాండ్‌కు చెందిన జిందాపోల్ నిచవోన్‌తో జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సైనా తొలి గేమ్‌ను 15-21 తేడాతో చేజార్చుకున్నప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకుని 21-6 తేడాతో విజయం సాధించింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 16-21 తేడాతో చేతులెత్తేయడంతో ఆమెకు పరాజయం తప్పలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ ఇప్పటివరకూ జిందాపోల్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో ఇదే తొలి ఓటమి. కాగా, ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 21-15, 12-21, 18-21 తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.

చిత్రం.. సైనా నెహ్వాల్