క్రీడాభూమి
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్లో భారత్ బోణీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లండన్, జూన్ 15: లండన్లో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్స్లో భారత్ శుభారంభాన్ని సాధించింది. గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్లో భారత్ 4-1 గోల్స్ తేడాతో పసికూన స్కాట్లాండ్ జట్టును మట్టికరిపించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే (6వ నిమిషంలో) స్కాట్లాండ్ కెప్టెన్ క్రిస్ గ్రాసిక్ తమ జట్టుకు అనూహ్యమైన గోల్ను అందించాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 0-1 తేడాతో వెనుకబడిన భారత జట్టుకు ఫార్వర్డ్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ 31, 34 నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ అందించగా, 40వ నిమిషంలో ఆకాష్దీప్, పెనాల్టీ కార్నర్ ద్వారా 42వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ చెరో గోల్ను అందించారు. దీంతో 4-1 గోల్స్ తేడాతో స్కాట్లాండ్ను ఓడించిన భారత జట్టు పూల్-బిలో శనివారం కెనడాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.