క్రీడాభూమి

బొపన్న ముందంజ.. సానియా అవుట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయ. కెనడాకు చెందిన గాబ్రియేల డ్రబోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన రోహన్ బొపన్న 7-6, 6-2 తేడాతో నికొలా మెక్టిక్, అనా జొన్జూ జోడీని ఓడించాడు. అయతే, మరో మ్యాచ్‌లో హైదరాబాదీ సానియా మీర్జా ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆమె క్రొయేషియాకు చెందిన వాన్ డోడింగ్‌తో కలిసి ఆడిన ఆమె హీథర్ వాట్సన్, హెన్రీ కొంటినెన్ జోడీ చేతిలో 6-7, 4-6 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. మొదటి సెట్‌లో గొప్పగా పోటీనిచ్చిన సానియా, డోడింగ్ దానిని కోల్పోవడంతో నిరాశ చెందినట్టు కనిపించింది. రెండో సెట్‌లో ఆశించిన స్థాయలో రాణించలేక అభిమానులను నిరాశ పరిచారు. ఇలావుంటే, సానియా, డోడింగ్ జోడీని ఓడించిన హీథర్ వాట్సన్, హెన్రీ కొంటినెన్ జోడీతో బొపన్న, గాబ్రియేల జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతారు.