క్రీడాభూమి

ముగిసిన నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్ల పాటు విధించిన నిషేధం అధికారికంగా పూర్తయింది. దీంతో ఆ రెండు జట్లు వచ్చే ఏడాది నుంచి మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై విధించిన నిషేధం పూర్తవడంతో ఆ రెండు జట్లను మళ్లీ ఐపిఎల్‌లోకి స్వాగతిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన విజయాల రికార్డుతో పాటు ఎంతో మంది అభిమానుల మద్దతును కలిగివున్న ఈ రెండు జట్ల పునరాగమనంతో వచ్చే ఏడాది నుంచి ఐపిఎల్ మరింత రసవత్తరంగా మారుతుందని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె.ఖన్నా పేర్కొన్నారు.