క్రీడాభూమి

ఆటపాటల్లో టీమిండియా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 30: శ్రీలంకను మొదటి టెస్టులో 304 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సభ్యులు ఆటపాటల్లో బిజీ అయ్యారు. ఐదు రోజు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగియడంతో, షెడ్యూల్ ప్రకారం చివరి రోజైన ఆదివారం టీమిండియా ఆటగాళ్లకు ఆటవిడుపు లభించింది. ఈ టూర్‌కు ఎంపికైనప్పటికీ, మొదటి టెస్టులో ఆడే అవకాశం లభించని రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఉంచిన ఫొటోలు భారత క్రికెటర్లు ఏ విధంగా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నది స్పష్టం చేస్తున్నది. కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. రోహిత్ శర్మ తీసుకున్న సెల్ఫీలో గాలే టెస్టులో సెంచరీలు సాధించిన శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా కూడా ఉన్నారు. ధావన్ తన టెస్టు కెరీర్‌లో అత్యధికంగా 190 పరుగులు చేయడమేగాక, ఒక సీజన్‌లో వంద లేదా అంతకంటే ఎక్కువ పరుగులను రెండు పర్యాయాలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, వీరేందర్ సెవాగ్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

ఫొటోలకు ఫోజులు: కోహ్లీ, హార్దిక్ పాండ్య