క్రీడాభూమి

మళ్లీ ఓడిన హాకీ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఐరోపా పర్యటనలో ఉన్న భారత హాకీ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం బూమ్‌లో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3-1 తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ టూర్‌లో తొలి మ్యాచ్‌లో ఇదే జట్టు చేతిలో 0-1 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు మరోసారి పేలవమైన ఆటతో అభిమానులను నిరాశపరచింది. మ్యాచ్ ప్రారంభం దూకుడుగా ఆడిన భారత్ ఆతర్వాత నీరసపడింది. నాలుగో నిమిషంలోనే అర్మాన్ ఖురేషి ద్వారా తొలి గోల్‌ను సంపాదించుకున్నప్పటికీ, ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరో నాలుగు నిమిషాల్లోనే బెల్జియంకు అమోరీ కస్టర్స్ ఈక్వెలైజర్‌ను అందించాడు. 21వ నిమిషంలో లోక్ లైపార్ట్ అద్భుతమైన గోల్ చేయగా, ప్రథమార్థం ముగియడానికి కొన్ని సెకన్ల ముందు విక్టర్ వెగ్నెజ్ గోల్ సాధించి, బెల్జియం ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. ద్వితీయార్థంలో భారత్ గోల్స్ కోసం విశేషంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బెల్జియం వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాన్ని అమలుచేయడంతో భారత ఆటగాళ్ల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు.