క్రీడాభూమి
ప్రపంచ యూనివర్శిటీ గేమ్స్ సంజీవనికి రజతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 August 2017
టైపీ సిటీ, ఆగస్టు 24: ఇక్కడ జరుగుతున్న 29వ ప్రపంచ యూనివర్శిటీ గేమ్సలో భారత అథ్లెట్ సంజీవని జాధవ్ రజత పతకాన్ని సాధించింది. మహిళల 10,000 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె 33:22.00 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానాన్ని సంపాదించింది. కిర్జిస్తాన్కు చెందిన డరియా మాస్లోవా 33:19.27 నిమిషాల సమయంతో స్వర్ణ పతకాన్ని అందుకుంది. నాసిక్కు చెందిన 20 ఏళ్ల సంజీవని ఇటీవల భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ మహిళల 5,000 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకాన్ని అందుకుంది. ప్రపంచ యూనివర్శిటీ గేమ్స్లో తన కెరీర్లో అత్యుత్తమ టైమింగ్ను నమోదు చేసి, రజతాన్ని స్వీకరించింది.