క్రీడాభూమి

మోనూ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 26: మోనూ గోయత్ విజృంభణతో తమిళ తలైవాస్‌పై పాట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పైరేట్స్ 35 పాయింట్లు చేయగా, తలైవాస్ జట్టు 24 పాయింట్లకు పరిమితమైంది. మోనూ 11 పాయింట్లు చేసి పైరేట్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పర్‌దీప్ నర్వాల్ 6, జైదీప్ 5 చొప్పున పాయింట్లు సంపాదించారు. తలైవాస్ ఆటగాడు అజయ్ ఠాకూర్ శ్రమ వృథా అయింది. అతను 10 పాయింట్లతో రాణించినప్పటికీ, మిగతా వారి నుంచి సరైన సహకారం అందకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు.
యు ముంబాకు షాక్
సొంత గడ్డపై యు ముంబా జట్టుకు చుక్కెదురైంది. పునేరీ పల్టన్‌తో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా రెండు పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కషిలింగ్ ఆడాకే 7, శ్రీకాంత్ జాధవ్ 5 పాయింట్లు చేయగా, పునేరీ పల్టన్ మొత్తం 26 పాయింట్లు సాధించింది. యు ముంబా తరఫున దీపక్ హూడా 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రాజేష్ మోండల్ 4 పాయింట్లు రాబట్టాడు.

చిత్రం..పాట్నా పైరేట్స్, తమిళ తలైవాస్ మ్యాచ్‌లో ఓ దృశ్యం