క్రీడాభూమి

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, ఆగస్టు 26: ఇక్కడ జరుగుతున్న 19వ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల 49 కిలోల విభాగంలో అమిత్ ఫంగల్, 56 కిలోల ఈవెంట్‌లో గౌరవ్ బింధూరి విజయాలను నమోదు చేశారు. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన 21 ఏళ్ల అమిత్ తన తొలి రౌండ్ ఫైట్‌లో ఇటలీకి చెందిన ఫెడెరికో సెరాను ఓడించాడు. కాగా, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న 18 ఏళ్ల శామ్ గుడ్‌మన్‌పై గౌరవ్ గెలుపొంది రెండో రౌండ్ చేరాడు. భారత బాక్సర్లు ఇద్దరూ పెద్దగా ఇబ్బంది లేకుండానే ముందంజ వేయడం విశేషం.