క్రీడాభూమి

సోమ్‌వీర్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 31: ప్రో కబడ్డీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ పోరాడి గెలిచింది. తమళ తలైవాస్‌ను ఢీకొన్న టైటాన్స్ 33 పాయింట్లు సాధించింది. తలైవాస్ 28 పాయింట్లే చేయడంతో, టైటాన్స్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టు తరఫున సోమ్‌వీర్ 10 పాయింట్లతో రాణించాడు. నీలేష్ సాలంకే 5, ఫర్హాద్ మిల్గర్ధన్ 4 చొప్పున పాయింట్లు చేశారు. తలైవాస్ ఆటగాళ్లలో అజయ్ ఠాకూర్ 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రపంజన్ 5, దర్శన్ 4 చొప్పున పాయింట్లు రాబట్టారు.
మరో మ్యాచ్‌లో యు ముంబా 36-32 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. యు ముంబా తరపున కషిలింగ్ అడాకే 10, శ్రీకాంత్ యాదవ్, అనూప్ కుమార్ చెరి 6 పాయంట్లు సంపాదించారు. పింక్ పాంథర్స్ ఆటగాళ్లలో పవన్ కుమార్ 10 పాయంట్లు చేయగా, జస్వీర్ సింగ్ 6 పాయంట్లు సాధించాడు.

చిత్రం.. 10 పాయింట్లతో రాణించిన సోమ్‌వీర్