క్రీడాభూమి
జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంటా : పాండే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంకతో గురువారం జరిగిన నాలుగో వన్డేలో అర్ధ సెంచరీ చేసిన మనీష్ పాండే టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ఆ మ్యాచ్ని 168 పరుగుల తేడాతో గెలుచుకొన్న నారత్ సిరీస్లో 4-0 ఆధిక్యత సాధించడం తెలిసిందే. తాను మామూలుగా మిడిలార్డర్లో బ్యాట్ చేస్తానని నాలుగోస్థానం మొదలుకొని ఆరోస్థానం దాకా భారత జట్టు తరఫున తాను వేర్వేరు స్థానాల్లో ఆడానని పాండే చెప్తూ, జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే తాను మరిన్ని పరుగులు సాదించాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే తాను ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాండే చెప్పాడు. కేవలం 42 బంతుల్లో నాలుగు బౌండరీలతో అర్ధ సెంచరీ చేసి నాటవుట్గా నిలిచిన పాండే ధోనీతో కలిపి అయిదో వికెట్కు 101 పరుగులు జోడించడం ద్వారా జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించడంలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, 300 వన్డే మ్యాచ్లు ఆడిన ధోనీని పాండే పొగడ్తలతో ముంచెత్తుతూ అలాంటి అనుభవజ్ఞులనుంచి తాము నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నాడు.