క్రీడాభూమి

సొంత గ్రౌండ్‌లో ఢిల్లీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో యు ముంబాను ఢీకొన్న దబాంగ్ ఢిల్లీ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచ్ చివరి వరకూ హోరాహోరీగా సాగింది. యు ముంబా 30 పాయింట్లు చేయగా, శక్తి వంచన లేకుండా పోరాడిన ఢిల్లీ 28 పాయింట్లు సాధించగలిగింది. ఢిల్లీ తరఫున అబుఫజల్ ఆరు, రోహిత్ బలియన్, మిరాజ్ షేక్, సునీల్ తలా నాలుగు చొప్పున పాయింట్లు సంపాదించారు. యు ముంబాకు శ్రీకాంత్ జాధవ్ 11 పాయింట్లు అందించి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. కషిలింగ్ అడాకే ఏడు పాయింట్లు చేశాడు.