క్రీడాభూమి

క్వార్టర్స్ చేరిన కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హో చి మిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 2: భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ పైనల్స్ చేరింది. 48 కిలోల విభాగంలో పోటీపడుతున్న 34 ఏళ్ల కోమ్ తన తొలి రౌండ్ ఫైట్‌లో స్థానిక ఫేవరిట్ డియెమ్ తి ట్రిన్‌ను పాయింట్ల ప్రాతిపదికపై ఓడించింది. తర్వాతి రౌండ్‌లో ఆమె చైనీస్ తైపీకి చెందిన మెంగ్ చియెన్ పింగ్‌ను ఢీ కొంటుంది. కాగా, 54 కిలోల విభాగంలో శిక్షా కూడా క్వార్టర్సలోకి అడుగుపెట్టింది. తొలిసారి ఈ టోర్నీలో పాల్గొన్న ఆమె మొదటి రౌండ్‌లో మంగోలియాకు చెందిన యున్ ఎర్డెన్ నెర్గుయ్‌పై విజయం సాధించింది.