క్రీడాభూమి

50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో పతకాలన్నీ మనకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), నవంబర్ 3: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామనె్వల్త్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్లు ప్రకాష్ నంజప్ప, అమన్‌ప్రీత్ సింగ్, జీతూ రాయ్ అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి సత్తా చాటుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో వారు అన్ని పతకాలను క్లీన్ స్వీప్ చేశారు. ఈ ఈవెంట్‌లో ప్రకాష్ మొత్తం 222.4 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, అమన్‌ప్రీత్ సింగ్ రజత పతకాన్ని, జీతూ రాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, ఇదే ఈవెంట్‌లో స్వప్నిల్ సురేష్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే మహిళల 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్ ఫైనల్‌లో అనురాజ్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇంతకుముందు ఈ టోర్నీలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో కూడా పతకాలన్నింటినీ భారత్ క్లీన్ స్వీప్ చేయడం గమనార్హం. ఈ ఈవెంట్‌లో షాజర్ రిజ్వీ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, ఓంకార్ సింగ్ రజత పతకాన్ని, జీతూ రాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

చిత్రం..క్లీన్ స్వీప్ చేసిన ప్రకాష్ నంజప్ప, అమన్‌ప్రీత్ సింగ్, జీతూ రాయ్