క్రీడాభూమి

క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంకాంగ్, నవంబర్ 23: ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పివి సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా, సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. చక్కటి ఫామ్‌లో ఉన్న సింధు 21-14, 21-17 తేడాతో అయా ఒహోరీని ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె అకానే యమాగూచీని ఢీ కొంటుంది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో అకానే 24-26, 21-16, 21-12 ఆధిక్యంతో సయాకా సాటోను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇలావుంటే, రెండో రౌండ్‌లో చెన్ యూఫెయ్‌తో తలపడిన సైనా మొదటి సెట్‌ను 21-18 తేడాతో సొంతం చేసుకుంది. దీనితో ఆమె మ్యాచ్‌ని గెలిచి, క్వార్టర్స్ చేరుతుందని అభిమానులు ఆశించారు. కానీ, ఆతర్వాతి రెండు సెట్లను 19-21, 10-21 తేడాతో చేజార్చుకొని సైనా నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రణయ్ 11-21, 21-10, 21-15 తేడాతో కజూమసా సకాయ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

చిత్రం..పివి సింధు