క్రీడాభూమి

ఇండోనేషియా టోర్నీపై సింధు, శ్రీకాంత్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జనవరి 22: ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీపై భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ కనే్నశారు. మంగళవారం నుండి జరిగే ఈ టోర్నీ ద్వారా విజేతలకు 350,000 డాలర్లు దక్కుతాయి. గత సీజన్‌లో ఆడిన వివిధ టోర్నీల్లో మిశ్రమ ఫలితాలు కనబరిచిన ఈ ఇద్దరూ రానున్న సీజన్‌ను కూడా విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇండోనేషియాకు చెందిన హన్నా రమదిని, మలేషియాకు చెందిన జుల్‌పఫదిల్ జుల్‌కిఫ్‌లీతో వేర్వేరుగా తలపడతారు. గత సీజన్‌లో సింధు మూడు టైటిళ్లతోపాటు మూడు కాంస్య పతకాలు సాధించగా, శ్రీకాంత్ అందరి అంచనాలను అధిగమించి నాలుగు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఇండోనేషియా టోర్నీలో ఆడి సత్తా చాటుతామని వారు పేర్కొన్నారు.