క్రీడాభూమి

బెల్జియంపై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్ (న్యూజిలాండ్), జనవరి 25: ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న బెల్జియం హాకీ జట్టును 5-4 ఆధిక్యంతో భారత జట్టు చిత్తు చేసింది. ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల హాకీ టోర్నమెంటు రెండో లీగ్‌లో భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. అంతకుముందు మొదటి లీగ్ తుది పోటీలో భారత్‌పై బెల్జియం 1-2 ఆధిక్యంతో గెలిచింది. గురువారం జరిగిన రెండో లీగ్ పోటీలో భారత హాకీ క్రీడాకారులు రూపేందర్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్ మెరుపు వేగంతో ఆడి జట్టు విజయానికి కారకులయ్యారు. బెల్జియం జట్టు తరఫున జాన్ దోహ్‌మెన్, హెండ్రిక్స్, టామ్ బూన్ స్కోర్లు సాధించారు. కోచ్ మరిజ్నే సూచనలతో భారత క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి తమ నైపుణ్యం ప్రదర్శించారు. ఈనెల 27న జపాన్ జట్టుతో భారత క్రీడాకారులు మూడో మ్యాచ్‌లో తలపడనున్నారు.