క్రీడాభూమి

ఫైనల్ చేరిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్ (న్యూజిలాండ్), జనవరి 27: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. శనివారం జరిగిన రెండో దశ మ్యాచ్‌లో జపాన్‌ను 4-2 తేడాతో ఓడించి, ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ జట్టు బెల్జియంతో పోరును ఖాయం చేసుకుంది. భారత్ తరఫున వివేక్ సాకర్ ప్రసాద్ (12వ నిమిషం), వరుణ్ కుమార్ (30వ నిమిషం), మన్‌దీప్ సింగ్ (58వ నిమిషం), రమణ్‌దీప్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించారు. జపాన్‌కు 14వ నిమిషంలో సెరెన్ తనాకా, 43వ నిమిషంలో షోటా యమాదా గోల్స్ అందించారు.