క్రీడాభూమి

యువసేనకు బీసీసీఐ నగదు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరిన భారత యువ ఆటగాళ్లకు బీసీసీఐ నగదు పురస్కారాలు ఇచ్చి సన్మానించనున్నట్టు ప్రకటించింది. బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మీడియాతో మాట్లాడుతూ క్రిస్ట్‌చర్చ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు సభ్యులను అభినందించాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రోత్సాహాం మరువలేనదని అన్నాడు. అతని పర్యవేక్షణలో దూసుకుపోతున్న యువ భారత్‌లో రానున్న కాలంలో మరెంతోమంది ముందుకు వస్తారని అంటూ, ద్రవిడ్ భావిభారత యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాడని అన్నాడు.