క్రీడాభూమి
మెల్బోర్న్లో వరల్డ్ టీ-20 ఫైనల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దుబాయ్, జనవరి 30: 2020లో జరిగే వరల్డ్ టీ-20 పురుషుల, మహిళల ఫైనల్ పోటీలకు ఆస్ట్రేలియాలో అతిపెద్దదైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కాబోతోందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. మహిళల వరల్డ్ టీ-20 పోటీలు 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ, పురుషుల టీ-20 పోటీలు అదే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తారు. ఆ దేశంలోని అడెలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, గీలాంగ్, హొబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాల్లో ఈ టోర్నమెంటు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెట్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. పురుషులకు సంబంధించి 16 దేశాల జట్లు పోటీ పడతాయి. మహిళల సెమీ ఫైనల్స్ సిడ్నీలో, పురుషుల సెమీ ఫైనల్స్ అడిలైడ్లో జరుగుతాయి. మహిళల, పురుషుల తుది సమరం మెల్బోర్న్లో జరుగుతుంది.