క్రీడాభూమి

విజయ్ హజారే ట్రోఫీలో యువ సంచలనం పృథ్వీ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: భారత అండర్-19 కెప్టెన్, యువ సంచలన ఆటగాడు పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 5 నుండి చెన్నైలో జరిగే ఇంటర్-స్టేట్ వనే్డ ఇంటర్నేషనల్ టోర్నమెంటులో ఆడే 16 మంది సభ్యులు గల జట్టులో ఒకడిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన ఆదిత్య థారే నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ (టీ-20 ఫార్మాట్)లో ఓటమి చెందిన ముంబయి ఆటగాళ్లు ఇపుడు ఆడనున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రతిష్టాత్మకం కానుంది. ఫిబ్రవరి 14వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ముంబయి జట్టు తొలుత ఫిబ్రవరి 5న జరిగే తొలిమ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడుతుంది.