క్రీడాభూమి

టీ-20లో మరిన్ని పరుగులు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: న్యూజిలాండ్‌తో ఈ వారం జరిగే టీ-20 ట్రై సిరీస్ ఫైనల్‌లో మరిన్ని పరుగులు సాధించి రికార్డు నెలకొల్పుతామని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్తన్ ఆగర్ ధీమా వ్యక్తం చేశాడు. గత శుక్రవారం ఆక్లాండ్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి విధించిన లక్ష్యం 243 పరుగులను అతి సునాయాసంగా విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఈ నేపథ్యంలో ఫైనల్‌లో తమ రికార్డును మళ్లీ బద్దలుకొడతామని ఆయన పేర్కొన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు అత్యధికంగా 32 సిక్సర్లు బాదారు. గడిచిన మ్యాచ్‌లో సృష్టించిన అద్భుత ఫామ్ తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, ఇదే ఉత్సాహంతో ఫైనల్‌లోనూ అదే తీరును ప్రదర్శిస్తామనే గట్టి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు.
తమ జట్టులో సరైన సమయంలో సముచిత రీతిలో ఆడే యువ ఆటగాళ్లకు కొదవలేదని, వారి సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన అన్నాడు. తమ ప్రత్యర్థి జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, కోలిన్ మన్రో వంటి ఉత్తమ ఆటగాళ్లు ఉన్నా, వారిని ఎలా ఎదుర్కోవాలన్న విషయమై తాము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశాడు.