క్రీడాభూమి

భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, మార్చి 5: భారత మహిళల హాకీ జట్టు 1-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించి ఇక్కడ ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళలు 1-0తో విజయం సాధించారు. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మ్యాచ్ ఐ నిమిషంలో భారత క్రీడాకారిణి లాల్రేమ్‌షియామి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. ఆ తరువాత దక్షిణకొరియా గోల్ చేయడానికి చివరివరకూ యత్నించినా ఫలితం దక్కలేదు. భారత రక్షణశ్రేణిని ఛేదించలేకపోయిన దక్షిణకొరియా జట్టు గోల్ చేయడంలో విఫలమైంది. భారత జట్టుకు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా దానిని దక్షిణకొరియా అడ్డుకుంది. ఆట రెండో క్వార్టర్‌లో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయింది. దక్షిణకొరియా గోల్ కీపర్ మిజిన్ సమర్థవంతగా పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి వెళ్లకుండా ఆపి భారత్ స్కోరును మరింత పెరగకుండా నిలువరించగలిగింది. కాగా, ఆట ముగిసేసరికి భారత్ ఆధిక్యంలో నిలవడంతో సిరీస్‌లో తొలి గెలుపును అందుకుంది.