క్రీడాభూమి

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: అంతర్జాతీయ స్థాయిలో టీ-20 క్రికెట్‌కు రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న దేశవాళి క్రికెట్ పోటీలో ఐపీఎల్ టీ-20 క్రికెట్ లీగ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు బంపర్ ఆఫర్. ఇక నుంచి బీసీసీఐ ఒక్కో జట్టుకు ఏడాదికి రూ.250 కోట్లు ఇవ్వనుంది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎల్ వార్షిక ఆదాయం నుంచి ఆయా జట్లకు ఈ భారీ మొత్తాన్ని అందించనుంది. ఇప్పటిదాకా ఒక్కో జట్టు రూ.60 కోట్లు మాత్రమే పొందేది. ఇది ప్రస్తుతం నాలుగు రెట్లు పెరగనుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రతి జట్టుకు రూ.250 కోట్ల చొప్పున ఇవ్వడం విశేషం. దీనికంతటికీ కారణం ఐపీఎల్ ప్రసార హక్కులను ఐదేళ్ల కాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16.347 కోట్ల భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడమే. దీంతో ఒక్కో సీజన్‌కు బీసీసీఐ రూ.2,200 కోట్లు పొందనుంది. ఇందులో నుంచే తమ ఫ్రాంచైజీలకు పంచనుంది. గతంలో సోనీ టీవీ ద్వారా ఏడాదికి రూ.800 కోట్లు మాత్రమే దక్కేది.