క్రీడాభూమి

ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 16: ప్రతిష్టాత్మకమైన నిదస్ ట్రోఫీ ముక్కోణపు టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. నిదహాస్ ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక టీ-20లో బంగ్లాదేశ్ జట్టు ఆతిథ్య శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా బంగ్లాదేశ్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ఫైనల్‌కు చేరుకుంది. ఈనెల 18న ఫైనల్‌లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఎడిజికే పెరీరా 40 బంతుల్లో ఒక సిక్సర్, 7 ఫోర్లతో 61, కెప్టెన్ తిషారా పెరీరా 37 బంతుల్లో 58 పరుగులతో అర్థ సెంచరీలు పూర్తి చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ మొదట్లోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన తమీమ్ ఇక్బాల్ 42 బంతుల్లో రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు, మహ్మదుల్లా కేవలం 18 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.