క్రీడాభూమి

మూడు ఇక్కడ.. నాలుగు అక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 20: ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతగడ్డపై ఆడే మ్యాచ్ వేదికల్లో మార్పు చోటుచేసుకుంది. మే 12 నుంచి 31 వరకు మరమ్మతుల కారణంగా చండీగఢ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో మే 4, 6, 12, 14న సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ ఆడే మ్యాచ్‌లను మొహాలీలో కాకుండా ఇండోర్‌లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కోరింది. దీనికి కౌన్సిల్ అంగీకరించడంతో నిర్వాహకులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఏప్రిల్ 15, 19, 23న జరిగే మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పు లేదు.. అవి యథావిధిగా మొహాలీలోనే జరుగుతాయని వారు తెలిపారు. ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి మ్యాచ్ అడనుంది.