క్రీడాభూమి

సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 22: భారత టేబుల్ టెన్నిస్ చాంపియన్ సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచార కేసు నమోదైంది. అతను పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, శారీరక సంబంధం పెట్టుకొని, ఇప్పుడు నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ 18 ఏళ్ల యువత బారాసాత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2014లో ఫేస్ బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని, ఆతర్వాత తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తాము కోల్‌కతాలోని ఘోష్ అపార్ట్‌మెంట్‌లో, అతని స్వస్థలైన సిలిగురిలో చాలాసార్లు కలుసుకున్నామని వివరించింది. తాను వారిస్తున్నప్పటికీ బలవంతంగా తనను అనుభవించాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. భారత టీటీ చాంపియన్‌షిగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిందిన 24 ఏళ్ల ఘోష్‌ను సంప్రదించడానికి పీటీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇలావుంటే, అతనిపై ఫిర్యాదు అందిందని, కేసును దర్యాప్తు చేస్తున్నామని సిలిగురి అదనపు ఎస్పీ అభిజిత్ బెనర్జీ తెలిపాడు.